PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరం కలిసికట్టుగా -పార్టీ విజయానికి కృషి చేస్తాం

1 min read

– నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు మైనార్టీ కాలనీకి చెందిన నంద్యాల పేట బాసూమియా సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు, అలాగే కమలాపురం నియోజకవర్గ మైనారిటీ నాయకులు అన్వర్ భాష , స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రబ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం ఆధ్వర్యంలో చెన్నూరు టౌన్ కు సంబంధించిన వైఎస్ఆర్సిపి నాయకుల కు కార్యకర్తలకు, అందరికీ ఆదివారం అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది , ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, అబ్దుల్ రబ్ లు మాట్లాడుతూ, చెన్నూరు టౌన్ నందు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారనే దానికే ఈ అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి తామంతా కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుందని, మా ఐక్యత దెబ్బతీసే దానికి ప్రతిపక్షాలు అనేక రకాలుగా మాట్లాడడం హాస్యాస్పదమని , తామంతా కలిసికట్టుగా ఉన్నామని రాబోయే ఎన్నికల్లో మైనార్టీ కాలనీ నుండి అత్యధిక మెజార్టీ వైసిపికి రావడం తధ్యమని వారు పేర్కొన్నారు, పార్టీ ఇప్పటికే మండల వ్యాప్తంగా బలంగా ఉందని, పార్టీ లో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పే వారికి, ఈ విందే సమాధానమని వారు తెలియజేశారు, భవిష్యత్తులో కూడా పార్టీ ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుందని నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముదిరెడ్డి శివరాం రెడ్డి , మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చీర్లసురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి చెన్నూరు టౌన్ అధ్యక్షులు ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ డిసిఎం ఎస్ చైర్మన్ పెడబల్లి ప్రతాప్ రెడ్డి , సచివాలయ కన్వీనర్ గుమ్మల్ల మధుసూదన్ రెడ్డి, కొండపేట ఎంపీటీసీ దుంప నాగిరెడ్డి, మైనార్టీ నాయకులు అశ్రత్ మండల కో ఆప్షన్ సభ్యులు వారిష్ , మైనార్టీ నాయకులు చోటు,సాదు కిషోర్ కుమార్ ,గ సచివాలయ కన్వీనర్ నీలం గోవింద రెడ్డి , వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ మండల కన్వీనర్ శ్రీనివాసులు.

About Author