PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంగ్లాదేశ్ కంటే మ‌నం వెనుక‌బ‌డి ఉన్నాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని… మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు.

                                                    

About Author