PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కావలి ఘటనను ఖండిస్తున్నాం.. బొందిలి సంఘం నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కావలిలో బస్ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు కర్నూల్ జిల్లా బొందిలి సంఘం నేతలు చెప్పారు. కర్నూల్లోని వీరి కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ఇంకోసారి ఇలాంటి దాడులు జరుగుతే ప్రతి జిల్లాలో బొందిలి సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు దాడి చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్లను శిక్షించాలని కోరారు. ఈ ఘటనలో అడ్డం వచ్చిన ప్యాసింజర్లను కూడా కొట్టడం దారుణమని తెలిపారు. ఈ సమావేశంలో కర్నూల్ జిల్లా బందిలి సంఘం ప్రెసిడెంట్ నారాయణ సింగ్, సెక్రెటరీ విక్రమ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ రఘు సింగ్, మరియు నాగరాజ్ సింగ్, సాయిచరణ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

About Author