NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితవాడ స్మశాన భూమి కేటాయింపుకు మేము ఒప్పుకోము…

1 min read

– వ్యతిరేకించిన గ్రామపంచాయతీ సభ్యులు. 

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం, ఆనందపురం ,దళితవాడ స్మశానభూమి కేటాయింపును వ్యతిరేకించిన గండిగుంట గ్రామ ఉపసర్పంచ్ 9మంది గ్రామ  పంచాయతీ సభ్యులు అని ,సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్, ఒక ప్రకటనలో తెలియజేశారు. గండిగుంట గ్రామ శివారు ఆనందపురం స్మశాన భూమి నిమిత్తం సర్వేనెంబర్ 0.23 సెంట్లు భూమి  సర్వే నెంబర్ 926 లోని0.23 సెంట్లు భూమిని అక్టోబర్ 5వ తేదీన  ఉయ్యూరు మండలం సర్వేయర్ ,వి.ఆర్.ఓ ,రెవిన్యూ ఇన్స్పెక్టర్ ,సమక్షంలో సర్వే చేసి కంకిపాడు సెక్షన్ జల వనరుల శాఖ ,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుమల శెట్టి వీరాంజనేయులు కు అప్పగించారు. ఆ భూమిని జల వనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది అని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author