PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచి నాయకుడిని కోల్పోయాం..!

1 min read

– నరాల బాల్​ రెడ్డి కుటుంబీకులకు సానుభూతి తెలియజేసిన హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్​
పల్లెవెలుగు వెబ్​, కడప: కడప జిల్లా ప్రొద్దటూరు మునిసిపల్ మాజీ చైర్మన్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు నరాల బాల్ రెడ్డి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వారి కుటుంబ సభ్యులకు ఫోన్ లో తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నరాల బాల్ రెడ్డి ప్రొద్దటూరు మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శవంతమైన పాలన అందించిన నీతి నిజాయితీ కలిగిన నాయకడని, రాజకీయాలలో అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న ప్రజా నేత అని, వారు జాతీయభావాలతో అంకిత భావంతో పనిచేశారని, సమాజ సేవ కోసం ఎల్లవేళలా కష్టపడేవారని దత్తాత్రేయ గారు గుర్తుచేసుకున్నారు. నరాల బాల్​రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

About Author