PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ జీవోల్ని వ్యతిరేకిస్తున్నాం.. !

1 min read

పల్లెవెలుగువెబ్ : కొత్త పీఆర్సీ పై అశాస్త్ర్రీయంగా ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా వారు పేర్కొన్నారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడైనా ఉందా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని ఎత్తివేస్తారా ? అని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండని, పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాక పోరాడుతామని తెలిపారు. అవసరమైతే సమ్మె చేసేందుకు వెనుకాడమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు.

            

About Author