PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రిస్తా..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన గూడెం కొట్టాల ప్ర‌జ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని 43, 44 వార్డుల ప‌రిధిలోని అశోక్ న‌గ‌ర్ పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌ను తాను త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రిస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ హామీ ఇచ్చారు. గూడెం కొట్టాల వ‌ద్ద ఏర్పాటుచేసిన స‌మావేశంలో టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులంద‌రూ టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంత‌రం భ‌ర‌త్ మాట్లాడుతూ ఇళ్ల కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్న వీరి స‌మ‌స్య‌ను తాను గెల‌వ‌గానే ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంపై యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా నారా లోకేష్‌తో చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే వీరంద‌రికీ న్యాయం చేస్తామ‌ని తెలిపారు. క‌నీస మౌలిక స‌దుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్ర‌భుత్వంలో అన్ని ధ‌ర‌లు పెరిగిపోయి స‌మాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద హుశేన్, చిన్న హుశేన్, స‌య్య‌ద్ హుశేన్‌, క‌మాల్‌, ఏసు, హరి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మ‌నోజ్, ప్ర‌భాక‌ర్‌, స్వర్ణలత, కృష్ణవేణి, నాగేశ్వరరావు, రవి కుమార్, అశోక్, వెంకటేష్ చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి, సురేంద్ర, లోకేష్, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author