NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయినాథ్ శర్మ కు అండగా ఉంటాం…

1 min read

రైతు పోరాటాన్ని విజయవంతం చేస్తాం 

వి ఎన్ పల్లె మండల వెల్దుర్తి గ్రామజన సైనికులు, నాయకులు 

పల్లెవెలుగు  వెబ్ కమలాపురం:   కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతుల కోసం అండగా నిలిచి పోరాటం చేస్తున్న తెలుగు నాడు రైతు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ కు మద్దతుగా వీరపనాయనపల్లి మండలం వెల్దుర్తి గ్రామ జన సైనికులు, గ్రామ ప్రజలు కమలాపురం లోని సాయినాథ్ శర్మ స్వగృహానికి విచ్చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం నిస్వార్ధంగా పోరాటానికి సిద్ధమై ముందుకు వస్తున్న సాయినాథ శర్మ వెంట తాము మనస్ఫూర్తిగా మద్దతు పలికి నడుస్తామన్నారు. నియోజకవర్గంలో గత రెండు దశాబ్దాలుగా నాయకులందరిని చూశామని సాయినాథ శర్మ అలాంటి నిజాయితీ నిస్వార్థ ప్రజా సేవకుడు నియోజకవర్గానికి చాలా అవసరమన్నారు. వీరపనాయన పల్లె మండలంలో రైతుల కోసం పోరాటం చేసే నాయకులే కరువయ్యారని ఇటువంటి పరిస్థితుల్లో సాయినాథ్ శర్మలాంటి పేదల మనిషి ప్రజా నాయకుడు రైతు సంక్షేమం కోసం ముందుకు రావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. సాయినాథ్ శర్మను కలిసిన వారిలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజుల కులయప్ప, పెద్ద కులయప్ప బాలకుల అయ్యప్ప రామచంద్ర మోహన్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ రామచంద్ర,రామ కృష్ణా, భయ్యా సుబ్బరాయుడు గురువయ్య తదితరులు బసిరెడ్డి పల్లె వాసులు శ్రీనివాసులు యాదవ్ మునయ్యా కలిసి మద్దతు ప్రకటించారు.

About Author