PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: కాటసాని తిరూపాల్ రెడ్డి

1 min read

– మృత దేహాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శించిన వైఎస్సార్ పార్టీ నాయకుడు కాటసాని తిరూపాల్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం పెద్దరాజు పాలెం గ్రామానికి చెందినవైఎస్సార్ పార్టీ కార్యకర్తలు ఈరం మద్దిలేటి స్వామిగుండె పోటు తో,పసుపల గ్రామానికి చెందిన గోనవరం సుబ్బరాయుడు అనారోగ్యం తో మృతి చెందారు.బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉండడం తో నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే సోదరుడు కాటసాని తిరూపాల్ రెడ్డి వారి మృత దేహాలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని,అలాగే వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కాటసాని తిరూపాల్ రెడ్డి తెలిపారు.పాల్గొన్న బండి బ్రహ్మానంద రెడ్డి,బనగానపల్లె మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు పసుపల జనార్దన్ రెడ్డి,పసుపల సర్పంచ్ మోహన్ బాబు,రంగ స్వామి,మూల చిన్న కొండయ్య, మధు సుధన్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

About Author