PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రుయా’ బాధితులకు అండగా ఉంటాం..

1 min read

– రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్​
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి: ఇటీవల రుయా ఆస్పత్రిలో ప్రమాదవ శాత్తు మృతి చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. చిట్వేలి మండలం కుక్కల దొడ్డి గ్రామానికి చెందిన కలందర్​ ఇటీవల రుయా ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు ఆక్సిజన్​ అందక మృతి చెందారు. బాధిత కుటుంబానికి మంగళవారం ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు రూ. 10లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శిరీష , పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి,ఉప సర్పంచ్ సాయి, కుక్కల దొడ్డి సర్పంచ్ రమణ, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author