PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం..: నేతి రమేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి : తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు రాజంపేట పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి నేతి రమేష్ బాబు.  శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాజంపేట తెలుగు యువత కార్యదర్శి గా నియమించడానికి సహకరించిన   అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బత్యాల చెంగళరాయుడు, టిడిపి నాయకులు చమర్తి  జగన్ మోహన్ రాజు , జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి , రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ రామ్ చిన్న బాబు,  రాజంపేట పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి,  Veraballi మండల తెలుగు దేశం పార్టీ నాయకులకు పార్టీ  కుటుంబ సభ్యులకు ప్రతిఒక్కరికి పెరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేసి హంగులు ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇవ్వడం విడ్డురంగా వుందని విమర్శించారు. 

About Author