PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ వి మోహన్ రెడ్డి  నాయకత్వంలో వైసీపీ లో కొనసాగుతాం

1 min read

భగత్ సింగ్ నగర్  వాసులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి  KDCC చైర్మన్ శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ల ఆధ్వర్యంలో స్థానిక  45 వ వార్డు భగత్ సింగ్ నగర్ (కప్పల్ నగర్)  కి చెందిన రాజు  ఆధ్వర్యంలో రాముడు నాగరాజు రఘు కృష్ణ తిరుపతి లు అనేక కుటుంబం లు వైస్సార్సీపీ పార్టీ లో చేరారు. వారికీ ఎస్ వి దంపతులు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎస్ వి దంపతులు మాట్లాడుతూ జగన్నన్న సంక్షేమ కార్యక్రమంలు ప్రతి పేదవాడి గుండెల్లో ఆయనకు స్థానం కల్పించాయి అని ఎవరెన్ని కుట్రలు చేసిన జగన్నన్నకు తిరుగు లేదు అని అన్నారు. పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండే మోహన్ రెడ్డి  వెంట నడుస్తాం అని తెలిపారు కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author