PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోజా దర్గా అభివృద్ధికి సహకారం అందిస్తాం : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: రోజా దర్గా అభివృద్ధికి ఎలాంటి సహకారం కావలన్న తమ టీజీవి సంస్థల నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి. భరత్ అన్నారు. నగరంలోని 48వ వార్డులో ఉన్న రోజా దర్గా ఉరుసు కార్యక్రమంలో టి.జి భరత్ పాల్గొన్నారు. రోజా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ రోజా దర్గా ఎంతో ప్రత్యేకత కలిగినదన్నారు. మా టి.జి.వి గ్రూపు తరుపున ఇప్పటికే ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఇది ఎంతోమందికి ఉపయోగ పడుతుందన్నారు. రోజా దర్గాకు కుల, మతాలకు అతీతంగా అందరూ వస్తారన్నారు. రోజా దర్గాలో అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్న తాము చేసేందుకు ముందు ఉంటామని భరత్ చెప్పారు. రోజా దర్గా ఉరుసు, రంజాన్ నెల ప్రారంభం ఒకే రోజు రావడం ఎంతో మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్సూర్ ఆలీఖాన్, రామంజనేయులు, విక్రమ్ సింగ్, రమీజ్, తదితరులు పాల్గొన్నారు.

About Author