NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్ అవినీతిని కూకటి వేళ్లతో పేకలిస్తాం.. టీడీపీ         

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   జగన్ అవినీతి సామ్రా జ్యాన్ని కూకటి వేళ్లతో పెక లిస్తామని టిడిపి శ్రేణులు ప్రతిన బూనాయి.  తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నాయకులతో కలిసి జగనాసుర అవినీతి నేర రావణాసుర పోస్టర్ ను విడుదల చేసారు. జగనాసుర ఒక్కో తలను చించుతూ, నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు రామానాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 1.A1ఖైది గా ఉంటూ ,2.భూమాఫియా,3.మైనింగ్ 4.మాఫియా,5.రైతు వ్యతిరేక, 6.రాబందు పాలన,7.బాబాయి హంతకుడుగా 8.కీచకుడుగా 9.భస్మాసురుడుగా అపద్దాలకోరు 10.లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.రాష్ట్రంలో ఆటవిక, రాక్షస పాలన సాగిస్తున్న జగన్‌ పూర్తి నిజస్వరూపం త్వరలో సీబీఐ దర్యాప్తు ద్వారా వెల్లడికానుందన్నారు. అధికారం కోసం కోడికత్తి డ్రామా, బాబాయి హత్యలను వాడుకుని అందుకు సంబంధించిన ఆధారాలను తుడిచివేసే ప్రయత్నం చేస్తుండటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వివేకానందారెడ్డి హత్య గురించి క్షుణ్ణంగా తెలిసీ తన సొంత పత్రిక, ఛానల్‌ ద్వారా నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై హేయమైన ప్రచారం చేసిన జగన్‌ కుట్రను ఆయన కుటుంబసభ్యులే బహిర్గతం చేశారన్నారు.ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి చెప్పిన వివరాల ప్రకారం హత్యకు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నారన్న నిజం వెలుగుచూసిందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేసిన అరాచకాలు, అవినీతికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా  కమిటీ నాయకులు,నియోజకవర్గ కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author