NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీర్ హైదర్ ఖాన్ నగర్లో అభివృద్ధి చేస్తాం.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాను ఎమ్మెల్యే అయిన వెంటనే మొదటి ప్రధాన్యతగా అమీర్ హైదర్ ఖాన్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలోని అమీర్ హైదర్ ఖాన్ నగర్లో ఆయన వార్డు పర్యటన చేపట్టారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, వృద్ధులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలను భరత్ దృష్టికి తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన టిజి భరత్ తాను ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను పాలించే నాయకుడు సరైన వ్యక్తి కాకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. తాను ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని భరత్ చెప్పారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మన్సూర్ ఆలీఖాన్, నాగరాజు, మద్దిలేటి, రామచంద్ర రెడ్డి, సుంకన్న, ఇస్మాయిల్, రఫిక్, తదితరులు పాల్గొన్నారు.

About Author