PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం ప్రభుత్వంలో దూదేకుల కుల‌స్థుల‌కు న్యాయం చేస్తాం..

1 min read

క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

మౌర్య ఇన్‌లో దూదేకుల కుల సంఘం పెద్దల‌ ఆత్మీయ స‌మావేశంలో పాల్గొన్న టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం ప్రభుత్వం వ‌చ్చాక దూదేకుల కుల‌స్థుల‌కు అన్ని విధాలా న్యాయం చేస్తామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో దూదేకుల కుల‌ సంఘం పెద్దల ఆత్మీయ స‌మావేశంలో టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. సంఘం పెద్దలు వారి స‌మ‌స్య‌ల‌ను టి.జి భ‌ర‌త్‌కు తెలియ‌జేశారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్నికులాలు, మ‌తాల‌కు న్యాయం చేస్తుంద‌న్నారు. త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత స‌మ‌స్య‌ల‌ను క్ర‌మ‌ప‌ద్దతిలో ప‌రిష్కరిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో అధికారం చేప‌ట్టబోయేది తామేన‌ని.. క‌ర్నూల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు దూదేకుల కుల‌స్థులు ముందుకు రావాల‌ని కోరారు. త‌న‌కు ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇస్తే స‌మ‌స్యల‌ను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్కరిస్తాన‌న్నారు. గ‌తంలో శంకుస్థాప‌న‌తోనే ఆగిపోయిన దూదేకుల కుల‌స్థుల క‌మ్యూనిటీ హాల్‌ను తాను గెలిచిన త‌ర్వాత పూర్తి చేసేందుకు కృషి చేస్తాన‌ని భ‌రత్ హామీ ఇచ్చారు. త‌న‌పై న‌మ్మకం పెట్టుకొని కుల‌,మ‌తాల‌కు అతీతంగా గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. 25 రోజులుగా క‌ర్నూల్లో వైసీపీ నేత‌లు ప్రజాసేవ చేస్తామ‌ని ప్ర‌చారాలు చేస్తున్నార‌న్నారు. ద‌శాబ్దాలుగా ఇక్కడే ఉంటూ నిస్వార్థంగా తాము ప్రజ‌ల‌కు సేవ చేస్తున్న విష‌యాన్ని ప్రజ‌లు గుర్తించాల‌న్నారు. మాయ‌మాట‌లు చెప్పే వైసీపీ నేత‌ల‌ను న‌మ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో దూదేకుల కుల‌స్థులు పాల్గొన్నారు.

About Author