PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం…

1 min read

– తెలుగుదేశం పార్టీ,యాదవ్ రాష్ట్ర కన్వీనర్ వై . నాగేశ్వరావు యాదవ్
పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల : గురువారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ అధ్యక్షులు అచ్చమ నాయుడు, యనమల రామ కృష్ణడు గారిని, బిసి సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లు రవింద్ర గారిని, టిడి జనర్దన్ గారిని కలసి రాష్ట్ర లోని బిసి మరియు యాదవ సమస్య లపై రిపోర్ట్ సమర్పించారు. వై . నాగేశ్వరావు యాదవ్ గారు మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ యాదవ్ సాధికార సమితి తరుపున ఇరవై ఆరు జిల్లాలు తిరిగి యాదవుల మరియు బిసిల సమస్యలు ఇబ్బందులు కష్టాలు తెలుసుకోని వారి సమస్యలు మీద యాదవ్ కన్వీనర్ గా, జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా,పోరాటం చేస్తున్నాము అని, మీరు కుడా మద్దతు తెలియ జేయ్యాలి అని కోరినారు.బిసిలపై జరుగుతున్న దాడులు హత్యలు, హత్యచారాలు గురించి బిసిలకు మరియు యాదవ్ లకు ఉన్న సమస్యలు గురించి వివరించారు. ఆ తరువాత ఏ ఏ జిల్లాలో యాదవులు, మరియు బీసీలు ఎక్కువ మంది ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో ఎమ్మెల్యే , మెదలగు టికెట్స్ కొన్ని ప్రాంతలలో యాదవ్ మరియు బిసిలకు ఇస్తే గెలిచే దమ్ము ఉన్న వ్యక్తుల గురించి కూడా అధ్యాయనము చేశాము అని, మళ్ళి ఇంక్కొక్క సారి పూర్తి ధర్యప్తు చేసి పర్సనల్ గా నివేదిక ఇస్తాను అని తెలియ జేశారు మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తాను అని మళ్ళి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెంద ఎగురవేసీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు అలుపెరుగనిపోరాటం శ్రామికుడునై చేస్తాను అని తెలియజేసారు.ఇంకా అనేక బిసి యాదవ్ సమస్యలు గురించి మాట్లాడటం జరిగింది అని వివరించారు.

About Author