PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

1 min read


పల్లెవెలుగువెబ్:
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంతో ఇకపై తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల చివరి కల్లా పీఆర్సీ ప్రకటించాలని లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇవాళ గుంటూరులో పెన్షనర్ల సంఘం సమావేశమైంది. ఇందులో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ… తమకు ఓపిక నశించిందన్నారు. నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి, లేకుంటే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆసుపత్రులకు వెళ్లేందుకు హెల్త్ కార్డులు లేవని.. ఇప్పటికే కోట్ల మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం జగన్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని శ్రీనివాసరావు కోరారు.

About Author