PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తాం

1 min read

శ్రీ మఠం పీఠాధిపతులు  శ్రీ సుబుధేంద్ర తీర్థులు

పల్లెవెలుగు వెబ్​  మంత్రాలయం : జర్నలిస్టులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ  మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు  అన్నారు. గురువారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా  కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం ఏపీయూడబ్ల్యూజే తాలూకా కమిటీ ,  మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో  ఏపీయూడబ్ల్యూజే  టోపీలను శ్రీ మఠం పీఠాధిపతి  సుబుధేంద్ర తీర్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వేసవికాలం లో జర్నలిస్టులు  వార్తలు కవరేజ్  కు వెళుతుంటారని వారిని దృష్టిలో ఉంచుకుని ఈ టోపీలను  మఠం తరపున ముద్రించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.   మంత్రాలయం నియోజకవర్గం లోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం, పెద్ద కడుబూరు మండలాలకు చెందిన 120 మంది  జర్నలిస్టులకు టోపిలను పీఠాధిపతులు అందజేశారు.అనంతరం జర్నలిస్టుల కు పీఠాధిపతులు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, మంత్రాలయం ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు జయరాజు,  ప్రధాన కార్యదర్శి ఉసేని, కోశాధికారి సాబువలి ,   సీనియర్ పాత్రికేయులు మాధవ్ ,మండల గౌరవ అధ్యక్షులు రానోజి రావు, అధ్యక్షులు భీమ రాయ్ , ఉపాధ్యక్షులు నాగరాజు కోశాధికారి రఫీ ,  ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్ ,  సీనియర్ పాత్రికేయులు  గోవిందు , ఎనుముల ఈరన్న ,  రామస్వామి , శ్రీ ధర్ ,  కంతం నరసింహ ,  బాబురావు , వీరేష్ ,  తిమ్మారెడ్డి ,  సతీష్, శివ ,  కోసిగి , కౌతాళం  , పెద్దకడబూరు మండలాల నుంచి జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు.

About Author