PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఒక్క అర్జీని పరిష్కరిస్తాం… కమిషనర్ ఎ.భార్గవ్ తేజ

1 min read

– కార్పొరేషన్ పాత కౌన్సిల్ హాల్ లో `జగనన్నకు చెబుదాం-స్పందనకార్యక్రమం.

– ఆర్జీలు స్వీకరించిన కమిషనర్ శ్రీ. ఎ.భార్గవ్ తేజ I.A.S

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం 07-08-2023 “జగనన్నకు చెబుదాం-స్పందన-ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి, కమిషనర్ శ్రీ. ఎ.భార్గవ్ తేజ I.A.S  వినతులు  స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం,ఇంజనీరింగ్,  సహా వివిధ విభాగాలకు సంబంధించి కమిషనర్కి వినతులు అందజేశారు. ఆయా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న వివిధ విభాగాధి పతులను కమిషనర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అర్జీకి పరిష్కారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో కమిషనర్ శ్రీ. A.భార్గవ్ తేజ I.A.S తో పాటు, ఎస్.ఈ. వేణు గోపాల్ , అసిస్టెంట్ సిటీ ప్లానర్ S. రంగస్వామి ,ఎం.హెచ్.ఓ. డాక్టర్ కె విశ్వేశ్వర్ రెడ్డి , మేనేజర్ ఎన్ చిన్న రాముడు గారు, సంబంధిత శాఖాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

About Author