PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నమ్మించి మోసం చేసే నాయకులను ఇంటికి పంపిస్తాం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బూటకపు హామీలతో ప్రతి ఎన్నికల్లో నమ్మించి మోసం చేసి కుటుంబ పాలన చేస్తున్న అసమర్ధ నాయకులను సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి పంపిస్తామని, అప్పుడే ప్రజా నాయకులు అనబడే వారు ఎన్నికై, ప్రజా పాలనను తీసుకొస్తారని బుధవారం పేటలో జరిగిన జయహో ప్రజా పలకరింపు యాత్రలో స్థానిక ప్రజలు ముక్తకంఠంతో జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రామయ్య యాదవ్ తో అన్నారు. 30 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ప్రాంతం రామయ్య యాదవ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యే గా ఉంటే ఒక అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తారని ఆకాంక్షించారు.

About Author