PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. టి.జి భరత్

1 min read

– కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజల ఇబ్బందులు.. వార్డు పర్యటనలో టిజి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 17 వ వార్డు పరిధిలోని సీపీఎం, సీపీఐ కొట్టాలలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి వారి  సమస్యలు తెలుసుకొన్నారు. కర్నూల్లోని అమీర్ హైదర్ ఖాన్ నగర్ తో పాటు ఈ ప్రాంతంలో కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య, నీటి కుళాయిల సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజీలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజల ఇబ్బందులు తొలగిస్తానని భరోసా ఇచ్చారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రజలకు మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు అభివ్రుద్ది కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సరైన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. అనంతరం గౌరి గోపాల్ హాస్పిటల్ లో ఉచితంగా చేయించే వైద్య పరీక్షల కరపత్రాలు ఇచ్చి పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు చంద్రమోహన్, వినోద్ చౌదరి, బాబ్జి,  శేఖర్, నాగన్న, చిన్న, ప్రమోద్, సూరి, అశోక్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

About Author