NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా క్షేత్రంలోనే జగన్ సంగతి తేలుస్తాం …    

1 min read

– టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ కుమార్ స్పస్తీకరణ                                                     

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రతిపక్షాలపై కక్షపూరితంగా నిర్బంధాలు, అరెస్టులు, రిమాండ్లు విధిస్తున్న జగన్ ప్రభుత్వం సంగతి ప్రజాక్షేత్రంలోనే తేలుస్తామని టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్ తేల్చి చెప్పారు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఒక నియంత పై బాబుతో నేను అనే కార్యక్రమంలో భాగంగా శనివారం పత్తికొండ టౌన్ 3 వ వార్డులో టిడిపి శ్రేణులు ఇంటింటికి   వెళ్లి ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను ప్రజలకు వివరించారు.స్కిల్ డెవలప్మెంట్ లో నారా చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెలిపే కరపత్రాలను ప్రజలకు పంచుతూ,  బాబు గారి అక్రమ అరెస్టు గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. అలాగే బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ అని టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు  తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.   పత్తికొండ  నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కే.ఈ. .శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు రామానాయుడు, అశోక్ కుమార్, తిరుపాలు, మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి, సింగం శ్రీనివాసులు,మీరా హుస్సేన్, శ్రీనివాసులు గౌడ్ బత్తిని లోకనాథ్, హోసూరు శ్రీనివాసులు, తిప్పన్న, సురేంద్ర తో పాటు  3 వ వార్డ్ టిడిపి ముఖ్యనాయకులు, యూనిట్ &బూత్  ఇంఛార్జ్ లు, వార్డ్ నాయకులు పాల్గొన్నారు.

About Author