NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాగునీరు, మురుగు సమస్య పరిష్కరిస్తాం: ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని కాలనీలో తాగునీరు దుర్వాసన వెదజల్లుతోందని ఎంపీడీఓ సుబ్బరాజుకు స్పందన ద్వారా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. సోమవారం తాగునీరు, మురుగుపై ఎంపీడీఓకు అర్జీ అందజేశారు. దీంతో ఎంపీడీవో కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టికట్ట రెండు రోజుల్లో తొలగించాలని, తాగునీరు దుర్వాసన రావడానికి కారణమైన పైప్ లైన్ తొలగించి దాని స్థానంలో మరోవైపు ఏర్పాటుచేసి కాలనీ కి నీరు అందించాలని హార్డ్ బేస్ మరియు పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఈ వోఆర్డి , ఏయూ పంచాయతీ రాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ,తోపాటు పంచాయతీ కార్యదర్శి నాగ సంజీవరావు ఇతరులు పాల్గొన్నారు.


About Author