PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు అండగా ఉండి ప్రోత్సహిస్తాం : టిజి భరత్

1 min read

– టిజిబి ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందించిన టిజి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు :క్రీడాకారులకు తామెప్పుడు అండగా ఉండి ప్రోత్సహిస్తామని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని మౌర్య ఇన్ లో టిజిబి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. టిజిబి యూత్ తరుపున విన్నర్ జట్టుకు రూ. 12 వేలు, రన్నర్ కు రూ. 6 వేల చెక్కును అందించారు. క్రీడాకారులను అభినందించి పోటీల్లో రాణించాలని చెప్పారు. కర్నూలులో మా టీజీవి సంస్థల తరుపున క్రీడలకు ఎప్పుడూ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. తమ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నందుకు టిజి భరత్ కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీ ఊట్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author