PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీర‌శైవుల‌మంతా క‌లిసి టి.జి భ‌ర‌త్‌ను గెలిపించుకుంటాం..

1 min read

– టిడిపి వీర‌శైవ సాధికార స‌మితి రాష్ట్ర క‌న్వీన‌ర్ శివ‌రాజ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రానున్న ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌ను భారీ మెజార్టీతో గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్న‌ట్లు తెలుగుదేశం పార్టీ వీర‌శైవ సాధికార స‌మితి రాష్ట్ర క‌న్వీన‌ర్ శివ‌రాజ్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని అశోక్ న‌గ‌ర్‌ పాల‌కొట్టాలు, సీతారాం న‌గ‌ర్‌, రామ‌లింగేశ్వ‌ర్ న‌గ‌ర్లో వీరు బిసి భ‌రోసా బాట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వీర‌శైవుల ఇళ్ల‌కు వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివ‌రించిన‌ట్లు శివ‌రాజ్ తెలిపారు. వీర‌శైవుల‌మంతా క‌లిసి టి.జి భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే చేసుకుంటామ‌న్నారు. నిస్వార్థంగా ప్ర‌జాసేవ చేస్తున్న టి.జి భ‌ర‌త్ నాయ‌క‌త్వం ఉంటేనే క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఇక చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంద‌ని, ఆయ‌న ప‌రిపాల‌న కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌ని శివ‌రాజ్ తెలిపారు. ఈ విష‌యాల‌న్నింటినీ వీర‌శైవుల‌కు వివ‌రిస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వీర‌శైవ ఐక్య‌వేదిక అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున‌ప్ప‌, నేత‌లు చంద్ర‌శేఖ‌ర‌ప్ప‌, విజ‌య్, శంక‌ర‌య్య‌, వెంక‌టేశ్వ‌ర్లు, ఈశ్వ‌ర‌ప్ప‌, శివ‌, మ‌హేష్‌, చంద్ర‌శేఖ‌ర‌య్య‌, రాజ‌శేఖ‌ర్, ఆదిగౌడ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author