PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భ‌ర‌త్‌ను గెలిపించుకునేందుకు కృషి చేస్తాం.. నాయి బ్రాహ్మణులు

1 min read

టిడిపి ప్రభుత్వంలోనే నాయిబ్రాహ్మణుల‌కు మేలు జ‌రుగుతుంది

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌

టిడిపిలో చేరిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే నాయి బ్రాహ్మణుల‌కు అన్ని విధాలా మేలు జ‌రుగుతుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో 51వ వార్డు కొత్తపేట‌కు చెందిన నాయి బ్రాహ్మణులు.. టిడిపి నేత‌లు చెన్నప్ప‌, రంగారెడ్డిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూల్లో టి.జి భ‌ర‌త్‌ను గెలిపించుకునేందుకు తాము కృషి చేస్తామ‌ని నాయి బ్రాహ్మణులు తెలిపారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తామ‌న్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో అన్ని కులాల వారికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌కు అండ‌గా ఉంటాన‌న్నారు. నాయి బ్రాహ్మ‌ణులు పడుతున్న ఇబ్బందుల‌ను ప్రణాళికాబ‌ద్దంగా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసులు, న‌వీన్ కుమార్, కుమార్‌, అజ‌య్‌, గోవిందు, తుల‌సి, మ‌ల్లికార్జున‌, బాబు, వెంక‌టేష్‌, వెంక‌టేశ్వ‌ర్లు, శ్రీను, కృష్ణ‌బాబు, నారాయ‌ణలు ఉన్నారు.

About Author