PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు ఘనస్వాగతం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళసై సౌందర రాజన్‌ కు కడప విమానాశ్రయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాదుకు వెళ్తూ మార్గమధ్యంలో కడప విమానాశ్రయానికి వారు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కడప విమానాశ్రయంలో గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్ కు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తో పాటు ఎస్పీ అన్బు రాజన్, కడప సబ్ కలెక్టర్ పృధ్వితేజ్ లు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో బ్రీఫ్ హాల్ట్ అనంతరం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మధ్యాహ్నం 2 .15 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో కడప, వల్లూరు తహసీల్దార్లు శివరామిరెడ్డి, సుహాసిని, కడప డిఎస్పీ సునీల్ , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author