PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న పాలనలో ఇంటింటా సంక్షేమం..

1 min read

– గడప గడపనా ఎమ్మెల్యే ఆర్థర్ కు జన నీరాజనం..
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: ఆదర్శంగా, పారదర్శకంగా సీఎం జగన్ పాలన సాగుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.గురువారం నందికొట్కూరు మున్సిపాలిటీలోని 7 సచివాలయ పరిధిలోని ఏబీఎం పాలేం కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ లతో కలసిగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలును వివరించారు. సమస్యలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్థర్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలుతో సకల జనుల సంక్షేమం జరుగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు.ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, తహశీల్దార్ రాజశేఖర్ బాబు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ సుకూర్ , కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి గారు, మొల్ల జాకీర్ హుస్సేన్, దేశెట్టి సుమలత, నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల ఉసేనయ్య, నందికొట్కూరు నియోజకవర్గ మహిళా నాయకురాలు డాక్టర్ వనజ , మాజీ కౌన్సిలర్ దేసెట్టి. శ్రీనివాసులు , మాజీ సింగిల్ విండో చైర్మన్ చందమాల బాలస్వామి , ఏబీఎన్ పాలెం వైసీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ , వైసిపి నాయకులు జాన్ , వెంకటస్వామి, మల్యాల శంకర్, బిజినవేముల వీరేష్, దామగట్ల నాగన్న, రత్నం, బ్రాహ్మణకొట్కూరు శ్రీనివాసులు, సాధనకోట వెంకటేష్, కొణిదెల భాస్కర్ రెడ్డి, పాములపాడు బంగారం శెట్టి శివలింగం, భాస్కర్, తాటిపాటి రమేష్, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author