సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం
1 min read
తల్లికి వందనం పేద విద్యార్థులకు వరం
ఏడాది లోపే నియోజకవర్గం లో రూ 63కోట్ల 92లక్షల 85 వేల తో అభివృద్ధి
పి-4 లక్ష్యంగా అక్షర ఆంధ్రప్రదేశ్ ద్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : సంక్షేమం, అభివృద్ధి, కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని మాధవరం టిడిపి కార్యాలయంలో ప్రభుత్వం ఏడాది సూపరిపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. తల్లి కి వందనం తో 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ గణాంకాలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 24.65 లక్షల మంది తల్లిదండ్రులు ఎక్కువగా లబ్ధి చేకూరినట్టుగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో రాష్ట్రం లోని అభివృద్ధి పనులు మొట్టమొదటి హామీ అయిన మెగా డీఎస్సీ 16,347 హామీ అమలు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక పింఛన్ల పెంపు తో అవ్వ తాతల కళ్ళల్లో, దివ్యాంగులు కలలో ఆనందం చూడడం జరిగిందని తెలిపారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల హామీ అమలు చేయడం జరిగిందని తెలిపారు. పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లో(204) హామీ అమలు చేయడం జరిగిందని తెలిపారు. తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణం రూ 15,000 తో కోట్ల తో ప్రారంభించడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలోపే మంత్రాలయం నియోజకవర్గానికి రూ 63 కోట్ల 92 లక్షల 85 వేల తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గానికి ఉపాధి హామీ పథకం ద్వారా మొదటి విడుదలో రూ 9 కోట్ల 56 లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేయడం జరిగిందని రెండో విడతలో ఐదు కోట్ల పనులు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీ రాజ్ లో నాబార్డ్ ద్వారా రూ 2 కోట్ల 60 లక్షలతో కల్లుకుంట నుండి మేకడోనా రోడ్డు, మూగలదొడ్డి రోడ్డు రావడం జరిగిందని తెలిపారు. మన నియోజకవర్గానికి ఆర్ అండ్ బి శాఖ ద్వారా రోడ్డు కలవర్ట్ మరియు హెల్త్ సెంటర్లో కందుకూరు మరియు మురవని గ్రామాలకు గానురూ 17 కోట్ల 12 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీర్చడానికి నియోజకవర్గంలో ఎంపి గ నిధులతో 36 బోర్లు వేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాల అదనపు గదులకు రూ 5 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎల్ ఎల్ సి మెయింటినెన్స్ కొరకు రూ1.62 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. టిఎస్ కాలువకి 16కిమీ గాను రూ 29 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 మంది గానురూ 18.85 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పులికనుమ ప్రాజెక్టు ద్వారా మంత్రాలయం నియోజకవర్గం లో ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించే బాధ్యత నాది ప్రభుత్వానిధి అని తెలిపారు. ఇది కేవలము కూటమి ప్రభుత్వము మరియు ప్రజల సహకారంతోనే జరిగిందని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఎంతో మెరుగైన పాలన అందించిందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రాఖేష్ రెడ్డి, బిజెపి ఇంచార్జ్ శ్రీ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, ముత్తు రెడ్డి, బసలదొడ్డి ఈరన్న, కౌతాలం సురేష్ నాయుడు, సతీష్, మంత్రాలయం నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజు, నరసింహ, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్, డేవిడ్, శేఖర్, మాలపల్లి నాయకులు చావిడి వెంకటేష్, చంద్ర, లక్ష్మయ్య, నరసింహులు, రచ్చమరి నాయకులు పోలి శివ, పోలీ వీరేష్, డీలర్ తిమ్మప్ప, వెంకట రాముడు, మోడల్ స్కూల్ ఛైర్మెన్ వెంకటేష్, హుశేని, సుంకేశ్వరి నాయకులు కురవ రామలింగప్ప, రంగ, డబ్బాల లక్ష్మి రెడ్డి, కురువ భీరప్ప, కురువ అయ్యప్ప, వీరారెడ్డి, నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.