NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలే జగనన్నను గెలిపిస్తాయి … ఎమ్మెల్యే          

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జగనన్నను తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తాయని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. గురువారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన 3వేల రూపాయలకు పెంచిన వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించి కొత్త ఒరవడి తీసుకువచ్చిన ఘనత సీఎం జగనన్నకు దక్కిందని  అన్నారు. పచ్చ కండువాలు కప్పుకున్న వారికే పథకాలు ఇచ్చి అసలైన పేదలు, లబ్ధిదారుల కడుపు కొట్టారని తీవ్రస్థాయిలో ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వాల పాలనలో పత్తికొండ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని, తన హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని రాబోయే ఎన్నికల్లో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్,జెడ్పీటీసీ,ఎంపిపి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, వైస్ ఎంపిపిలు, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్లు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author