PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన ప్రతి కుటుంబానికి- సంక్షేమ పథకాలు 

1 min read

– గడప గడప కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం

 – ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ-

 – అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్న.. ఎమ్మెల్యే, పోచంరెడ్డి,రవీంద్ర నాథ్ రెడ్డి,

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, మంగళవారం చెన్నూరు టౌన్ లోని రాజుల కాలనీ, సరస్వతీ నగర్, కొత్త గాంధీనగర్ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అలాగే ఆయన తనయులు నరేన్ రామాంజనేయుల రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందించడం అందించడం జరుగుతుందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి 2 వేల 5 వందల నుండి 2 వేల 7 వందల50 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం కొంతమంది ప్రజలు, తమకు డ్రైనేజీ సమస్య ఉందని అలాగే మరి కొంతమంది ఇంటి స్థలాలు కావాలని కోరడం జరిగింది, సానుకూలంగా వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే అక్కడ అధికారులను ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని ఆదేశించడం జరిగింది, అదేవిధంగా కొంతమంది రైతులు రైతు భరోసా పడలేదని , ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి తెలియజేశారు,స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు , ఇంటి స్థలాలు, పక్కా గృహాలు ప్రభుత్వపరమైన ఏ సంక్షేమ పథకమైన అందేవిధంగా గ్రామ వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలియ చేశారు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య , అదేవిధంగా రేషన్ కార్డులు కావాలని, ఆధార్ కార్డు లు మార్పులు చేర్పులు కావాలని, అడిగే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు తెలియజేశారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు, మీరు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులు అంతా కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు, మీ సమస్యలు తెలుసుకునేందుకే మీ ఇంటి వద్దకే రావడం జరిగిందని ఆయన ప్రజలను పదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఆ పథకం అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు, అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి , జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ , వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి , , సర్పంచులు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య,  సొంటo నారాయణరెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, గుమ్మల మధుసూదన్ రెడ్డి, రఘురామిరెడ్డి, సాదిక్ అలీ, కమలాపురం నియోజకవర్గం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, పేరు సామల నిత్య పూజ, సీతారాం, కృష్ణ, జకరయ్య, ఆదినారాయణ, చంద్ర, రమణ, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,, అబ్దుల్ రబ్, వైఎస్ఆర్సిపి నాయకులు , మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author