NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చరిత్రలో ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు

1 min read

– మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న ఎంతో అవసరం:జడ్పీటీసీ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరమని జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో పల్లెకు పోదాం అనే కార్యక్రమం మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపయోగపరమైన పనులు ఈ ప్రభుత్వంలో జరిగాయని అంతేకాకుండా చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని నాయకులు అన్నారు.మా నమ్మకం నువ్వే జగనన్న పథకాల నగదు వివరాల బోర్డును నాయకులు ప్రారంభించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యం అనినాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,మార్కెట్ యార్డ్ చైర్మన్ రాహత్ జబ్బార్,జెసిఎస్ మండల కన్వీనర్ బి.రవికుమార్,మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్నమల్లారెడ్డి,సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,సర్పంచులు ఫణిభూషణ్ రెడ్డి,నాగ స్వామి రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి,తువ్వా రామ నాగేశ్వరరెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి,చంద్రశేఖర రెడ్డి, మల్లేశ్వర రెడ్డి,పంచాయితీ కార్యదర్శి వినోద్ మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author