PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలు.. వీఆర్​ఏలకు వర్తింపజేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు వి ఆర్ ఏ లకు వర్తింపజేయాలని గత రెండు రోజులుగా వి ఆర్ ఏ లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ  స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల వీఆర్ఏలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు డిఏ తో కూడిన 21 వేలు జీతం ఇవ్వడంతోపాటు వీఆర్ఏల అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.రివర్స్ పిఆర్సి  పసంహరించుకోవాలని,నామినీలుగా ఉన్న వారందరినీ విఆర్ఏ  లుగా నియమించాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.65 సంవత్సరాలు దాటి మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిసిఎల్ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాయచోటి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వీఆర్ఏలు పాల్గొన్నారు.

About Author