PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోన‌సీమ ఘ‌ట‌న ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

                                             

About Author