PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ వేసుకుంటే ఏంటి స‌మ‌స్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిజాబ్ ధ‌రించ‌డం పై క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్‌ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య?అని ఒవైసీ స్పందించారు.

                                         

About Author