PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపు పై కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఏమ‌న్నారంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారని, అన్ని రంగాల్లో ఇబ్బంది ఏర్పడిందని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లా కోడుమూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, శ్రీలంక త‌ర‌హా పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగు సాగు నీరందిస్తామన్నారు. ఫ్లెక్సీలపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో మంత్రులు కేవలం ప్రొటోకాల్ కొరకే వున్నారని విమర్శించారు.

                          

About Author