NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైనిక తిరుగుబాటు పై నిపుణులు ఏం చెబుతున్నారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సైనిక తిరుగుబాటు జరిగిందని, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధం చేసిందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో పస లేదని, సైనిక తిరుగుబాటు వార్తలు అన్నీ ఉత్తవేనని చైనా నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి తేల్చి చెప్పారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో పాల్గొన్న జిన్‌పింగ్ స్వదేశం చేరుకున్న అనంతరం సైన్యం ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకుందన్న వార్తల్లో నిజం లేదని చైనా నిపుణుడు అదిల్ బ్రార్ కొట్టిపడేశారు. బహుశా జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

                                                

About Author