PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అద్భుత ప్రదర్శన పై కొహ్లీ ఏమన్నారంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత జట్టు చివరి బంతికి విజయం సాధించి శుభారంభం చేసింది. క్రికెట్ చరిత్రలో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఈ దశాబ్దంలోనే ఇది మొదటిది కావడం విశేషం. బంతిబంతికి విజయం చేతులు మారిన వేళ చివరి బంతికి విజయం సాధించిన టీమిండియా ప్రపంచకప్ ప్రస్థానాన్ని సగర్వంగా ప్రారంభించింది. ఈ విజయం క్రెడిట్ మొత్తం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లీకి దక్కుతుంది. చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన కోహ్లీ అద్భుత ఆటతీరుతో మరోమారు ‘కింగ్’ అనిపించుకున్నాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేసి ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడడం తనకే చెల్లు అని నిరూపించుకున్నాడు.

About Author