PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రం ఏమైనా నీ జాగీరా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి ఐదు నిమిషాలు చాలు అన్న మంత్రి బొత్సపై టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రమేమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వారి హక్కుల కోసం పాదయాత్రలు చేస్తుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ప్రాజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొద్దా? అని వైసీపీ నేతలు అంటున్నారని… దద్దమమ్మల్లారా అభివృద్ధి చేస్తే వద్దని ఎవరంటున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

                                         

About Author