NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసిపి చేస్తున్నాది దుర్మార్గ పాలన

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: వైసిపి చేస్తున్నాది దుర్మార్గ పాలనని క్లస్టర్ ఇంచార్జ్ ఆర్.ఈ.రాఘవేంద్ర , డోన్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు & యూనిట్ ఇంఛార్జ్ కుమ్మరి సుధాకర్ తెలిపారు.డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ప్యాపిలి మండలంలోని అలేబాద్ గ్రామం,మునెమడుగు గ్రామం మరియు అలేబాద్ తాండ గ్రామలలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల దగ్గరకు వెళ్ళి వైసిపి చేస్తున్నా దుర్మార్గ పాలనను వివరిస్తూ తెలుగుదేశంపార్టీ బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా 1వేసి ఓటును వేసి గెలిపించాలని కోరారు .ఈకార్యక్రమంలో అలేబాద్ సర్పంచ్ హరి ,మునెమడుగు గుండు రావు, అలేబాద్ తాండ గోపి నాయక్ , గాంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author