PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలపై బుధవారం కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే సీపీఎస్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జీపీఎస్ అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి జీవోలను సైతం అధికారులు సిద్ధం చేశారు. కేబినెట్‌ భేటీలో లాంఛనంగా ఆమోదించే అవకాశం ఉంది.

                                           

About Author