NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేనెప్పుడు సీమ‌కు వ‌చ్చిన నేల పుల‌కిస్తుంది : చిరంజీవి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాద‌ర్ సినిమా, అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుక మధ్యలో వర్షం మొదలైంది. అంత వర్షంలోను చిరంజీవి తడుస్తూనే తన ప్రసంగాన్ని మొదలెట్టారు. “నిజంగా నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈ రోజున నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను రాజకీయాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు గానీ, ‘ఇంద్ర’ సినిమాలో వర్షం పాట సమయంలోను వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఇలా వర్షం కురవడం నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తోంది. థ్యాంక్యూ వరుణ దేవా .. థ్యాంక్యూ సోమచ్.

                                 

About Author