PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్క‌డంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సినిమా ఆచార్య‌. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రెడీ అయ్యింది చిత్రయూనిట్‌. ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరపనున్నట్లు మీడియాకు వెల్లడించింది. వేలాది మంది మెగా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆచార్య సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు.

                                  

About Author