PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవమానం ఎదుర్కొన్న చోటే.. గెలిచిన రైతు

1 min read

పల్లెవెలుగువెబ్ : తుముకూరుకు చెందిన రైతు కెంపెగౌడ ఇటీవల మహింద్రా షోరూమ్ లో అవమానాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మహీంద్రా సిబ్బంది రైతు ఇంటికే వెళ్లి వాహనాన్ని డెలివరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతు కెంపెగౌడను మహీంద్రా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా కెంపెగౌడ ఆర్డర్ చేసిన బొలెరో పికప్ ట్రక్‌ను సిబ్బంది నేరుగా ఆయన ఇంటికే తీసుకెళ్లి అప్పగించారు. మరోమారు ఆయనకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా రైతు కెంపెగౌడ మాట్లాడుతూ.. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. వాహనాన్ని సమయానికి డెలివరీ చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

      

About Author