PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోవాలో ఏ పార్టీ ముందంజ‌లో ఉందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గోవాలో బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో కొన‌సాగుతోంది. బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా.. ఆప్ 2 స్థానాల్లో , స్వ‌తంత్రులు 9 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. ఒకవేళ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం బీజేపీకి రాక‌పోతే మ‌హ‌రాష్ట్ర‌వాది గోమంత‌క్ పార్టీ మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని బీజేపీ యోచిస్తోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ గోవాలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తున్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గోవా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంజీపీ సహాయం చేసింది.

                                          

About Author