PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలో అధికంగా అద్దె చెల్లించే ప్రాంతం ఏదంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ మరో రికార్డు సొంతం చేసుకుంది. దేశంలోనే అధికంగా అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. జేఎల్ఎల్ సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్‌ (రూ.8276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్‌ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్‌ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్‌ వర్క్‌ప్లేస్‌ డిమాండ్‌ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్‌ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది.

About Author