PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్య‌ధిక వాయి కాలుష్యం ఉన్న న‌గ‌రం ఏదంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్య తీవ్రత భారీగా పెరిగిపోతున్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. 2010-2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 7వేల నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన ‘హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ బుధవారం ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లోని పీఎం2.5 సగటు స్థాయిలను పరిశీలిస్తే.. ఢిల్లీలోనే అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. పీఎం2.5 కాలుష్యం కారణంగా 2019లో 7239 నగరాల్లో 17 లక్షల మరణాలు సంభవించాయని పరిశోధకులు వెల్లడించారు.

                                         

About Author