PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ల్ల‌ధ‌నం తెస్తాన‌ని తెల్ల‌ముఖం వేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు తెల్లముఖం వేశారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక కాలం చెల్లిందని, కాంగ్రెస్‌కు చరిత్రే మిగిలిందని అన్నారు. రాహుల్‌ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టినా అడిగేవారు లేరని చెప్పారు. ఒక్క ఛాన్స్‌ అని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారని, దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే 50 ఏళ్లు అధికారం ఇచ్చారని అన్నారు. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.

                                               

About Author