PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిమాచల్, గుజరాత్ లో అధికారం ఎవరిది అంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకుని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతీ ఎన్నికల్లో ఓటర్లు అధికారపార్టీని మార్చేస్తారు. గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని తర్వాతి ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఈ ఆనవాయితీపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోగా.. ప్రధాని మోదీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంది.

About Author